సూర్య 70 కోట్ల అప్పు ఉండడం వల్లే ఇలా!
సూర్య నిర్మాతగా మారి తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నిర్మించిన సినిమా పోంమగళ్ వండాల్. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైపోయి రిలీజ్ కు సిద్ధమవగా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. థియేటర్లు తెరుచుకోవడానికి ఇంకా రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో సూర్య డేర్ చేసి సినిమాను డైరెక్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేస్తున్నాడు. జూన్ 29న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
నాకు 70 కోట్ల అప్పు ఉంది. ఇంకేం చేయమంటారు? నా సినిమాలు ప్లాప్ అయినప్పుడు ఎవరైనా వచ్చి ఆదుకున్నారా? నా సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఓవర్ ఫ్లోస్ నమోదైనప్పుడు నిజాయితీగా తిరిగి నిర్మాతకు డబ్బులు చెల్లించిన డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడా? ఇకపై కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే చేసుకుంటా అని ఖరాఖండీగా చెప్పేసాడు.
ఇదిలా వుంటే లాక్డౌన్ తరువాత సీనీ రంగంలో సమగ్ర మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అందులో అత్యంత ప్రధానంగా బడ్జెట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లలో భారీగా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇంతకు ముందు తరహాలో భారీగా పారితోషికాలు ఇవ్వడం కుదరదు. బడ్జెట్లు కూడా భారీగా తగ్గించే అవకాశమే అత్యధికంగా కనిపిస్తోంది.సినిమా రంగం మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కుంటోంది. ఇప్పటికే రిలీజ్ కు సిద్ధంగా వున్న చిత్రాలు లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా? ఎప్పుడు థియేటర్లకు పర్మీషన్ ఇస్తారా అని ఎదురుచూస్తున్నాయి
విషయం తెలిసిన తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం మరోసారి ఈ నిర్ణయాన్ని పరిశీలించుకోవాలని కోరింది. దీనికి సూర్య అంగీకరించకపోవడంతో ఆయనకు సంబంధించిన నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చే చిత్రాలని నిషేధిస్తున్నట్టు ప్రకటించాయి. దీనికి పై కొంత మంది నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 మంది వరకు నిర్మాతలు సూర్యకు అండగా నిలిచారు. దీంతో వివాదం మరో మలుపు తిరిగే అవకాశం వుందని కోలీవుడ్లో వినిపిస్తోంది.
అయితే మొదట డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అన్నప్పుడు తమిళ డిస్ట్రిబ్యూటర్లు విపరీతంగా స్పందించారు. ఈ చర్యను ఖండిస్తున్నామని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కనుక డైరెక్ట్ రిలీజ్ చేస్తే తన సినిమాలను బాయ్ కాట్ చేస్తామని ఎవరం కొనుగోలు చేయమని తెలిపారు. అయితే సూర్య వెనక్కి తగ్గలేదు. తన సినిమాను తన ఇష్టం వచ్చినట్లు రిలీజ్ చేసుకుంటానని తేల్చి చెప్పాడు.
ఏప్రిల్ 9న ఈ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలై ఈ చిత్ర టీజర్, మోహన్బాబు క్యారెక్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇదిలా వుంటే సూర్య మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. తనకు మాస్ ఇమేజ్ని తీసుకొచ్చిన యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయబోతున్నారట.
దీనికి చాలా మంది సిద్ధపడాలని ఇప్పటికే రాజమౌళి లాంటి దర్శకులు చెబుతున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా తన పారితోషికాన్ని తగ్గించుకుంటున్నానంటూ తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఇటీవల వెల్లడించారు. తాజాగా యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి తన పారితోషికాన్ని తగ్గించుకుంటున్నానంటూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. సూర్య. విక్రమ్లతో హరి యాక్షన్ చిత్రాలు తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Post a Comment